Telangana IT Minister KTR Says 'Only Remain Tears If Mahakutami Gets Power In Telangana' #TelanganaElections2018 #KCR #KTR #TRS #Congress #Mahakutami #Telangana మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలకు మళ్లీ కన్నీళ్లే మిగులుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మహాకూటమి గెలిస్తే దాని జుట్టు చంద్రబాబు చేతిలోకి వెళుతుందని... తెలంగాణ అభివృద్ధికి చంద్రబాబు అంగీకరించరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నెలకొకరు ముఖ్యమంత్రి అవుతారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ మోచేతి నీళ్లు తాగే నేతలు మనకొద్దు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నంకు ఐదు టీఎంసీల నీరు తీసుకొస్తే... ఇక్కడ 85 వేల ఏకరాలు పచ్చగా మారతాయన్న కేటీఆర్...అలా జరగకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.