Ms dhoni missed his farewell match because the postponement of t20 world cup#MsDhoni#T20WORLDCUP#Chennaisuperkings#Csk#Ipl2021ఆస్ట్రేలియా వేదికగా గతేడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కరోనా కారణంగా వాయిదా పడటంతోనే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫేర్వెల్ మ్యాచ్ ఆడలేకపోయాడని మాజీ సెలెక్టర్ శరణ్దీప్ సింగ్ అన్నాడు. భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీ గతేడాది ఆగస్టులో అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. వాస్తవానికి టీ20 ప్రపంచకప్ అందుకొని దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తరహాలో ఆటకు సగర్వంగా ధోనీ వీడ్కోలు పలకుతాడని అంతా భావించినా.. ఈ జార్ఖండ్ డైనమైట్ మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.