IND V WI 2019:India won the weather-hit second match by 22 runs via Duckworth-Lewis method on Sunday to clinch the series with a game to spare. #indvwi2019 #viratkohli #rohitsharma #msdhoni #klrahul #rishabpanth #cricket #teamindia ఇప్పటికే వెస్టిండీస్పై సిరీస్ గెలిచాం. తదుపరి మ్యాచ్లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించే వీలు పెరిగింది. మా అంతిమ లక్ష్యం మాత్రం విజయం సాధించడమే అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఆదివారం లాడర్హిల్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. విండీస్ చేధనలో మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం 22 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. తాజా విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.