ms dhoni run out as key point for mumbai indians thrilling win in ipl 2019 final #ipl2019 #cskvmi #msdhoni #iplfinal #chennaisuperkings #mumbaiindians #shanewatson #rohitsharma ఐపీఎల్ 2019 సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రనౌట్పై వివాదం చెలరేగుతోంది. ఉప్పల్ వేదికగా ముంబయి ఇండియన్స్తో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. లేని పరుగు కోసం ప్రయత్నించిన ధోని రనౌటయ్యాడు. అయితే.. బంతి వికెట్లకి తాకే క్షణంలోనే ధోనీ తన బ్యాట్ని క్రీజులోకి ఉంచి ఉండటంతో.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాట్స్మెన్కి అనుకూలంగా నిర్ణయం ఇచ్చి ఉండాలని ధోనీ అభిమానులు వాదిస్తున్నారు. ఈ మ్యాచ్ కీలక సమయంలో ధోనీ రనౌటవడంతో.. ఒత్తిడికి గురైన చెన్నై.. ఆఖరికి ఒక్క పరుగు తేడాతో ఓడి ముంబయికి టైటిల్ను చేజార్చుకుంది.